Weight Loss: ప్రస్తుత కాలంలో ఎంతో మంది ప్రజలు ఊబకాయం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారుతున్న జీవన విధానం కారణంగా ఎన్నో రకాల కొత్త వ్యాధులు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఎక్కువ మంది యువత ప్రస్తుతం అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అలా బరువు పెరిగిపోవడంతో తిరిగి తగ్గడానికి ఎన్నో పద్దతులను ఫాలో అయ్యి చివరికి నిరాశ చెందుతున్నారు. వాటిలో ముఖ్యంగా తిండి మానేస్తే లావు తగ్గుతామ అనుకుంటున్నా వారే ఎక్కువగా ఉన్నారు. అలా అనుకుని లేని రోగాలను సైతం కొనితెచ్చుకుంటున్నారు.
బరువు తగ్గడం కోసం అన్నం మానేసి చపాతీలు తింటున్నారు. అలాగే గోధుమ రొట్టె తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చాలా కాలంగా ప్రచారం ఉంది.
ఎక్కువ మంది చపాతీలను రాత్రి వేళల్లో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తుంటారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం బియ్యంతో పోలిస్తే గోధుమలను జీర్ణం చేసుకోవడంలో చాలా సమస్యలు ఎదురవుతాయట.
గోధుమలను తినడం వలన వీట్ అలర్జీ, సీలిక్ డిసీస్, గ్లూటెన్ సెన్సిటివిటీ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. అంతేకాకుండా వీటి వలన తలనొప్పి నుంచి విరోచనాల వరకూ చాలా సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరో వైపు గోధుమలలో జిగటగా ఉండే గ్లూటెన్, గ్లియాడిన్ అనే ప్రొటీన్లు మన పొట్టలోని పేగులకు అతుక్కుని ఆహారాన్ని సరిగా జీర్ణం కనివ్వకుండా అడ్డుపడుతుందట. ఇలా జరగడం వలన పేగులకు అందాల్సిన పోషకాలు సరిగ్గా అందకపోవడంతో కొత్త సమస్యలు తలెత్తుతాయట.
ప్రస్తుతం మనకు మార్కెట్లో లభిస్తున్న గోధుమ పిండి రిఫైన్డ్ విధానంలో తయారీ అవ్వడంతో అనారోగ్యానికి కరణమవుతుందట. కాబట్టి ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకుని డాక్టర్ల సలహా మేరకే వాటిని మీ రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.