పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాధే శ్యామ్’. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో రూపొందుతున్న 20 వ సినిమా. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు సమర్పిస్తుండగా యువి క్రియోషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, ప్రశీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపించబోతుందని తెలుస్తుంది.
బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ ఒక భారీ పాన్ ఇండియన్ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ అన్న టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా స్ట్రైట్ గా హిందీతో పాటు తెలుగులో నిర్మితమవుతుండగా మిగతా అన్ని భాషల్లో డబ్ చేయనున్నారు. ఇక హాలీవుడ్ లోను ఈ సినిమా రిలీజ్ చేస్తారని అంటున్నారు. ప్రభాస్ ని రాముడిగా చూపించబోతున్నాడు దర్శకుడు. అలాగే మరో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేష్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద విపరీతమైన బజ్ క్రియోటయిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పటికే వైజయంతీ మూవీస్ నిర్మించబోతున్న మరో పాన్ ఇండియన్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో దీపికపదుకుణె హీరోయిన్ గా నటించబోతుంది. అయితే ఆదిపురుష్, ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలని ఒకేసారి సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2021 లో ఈ రెండు సినిమాల చిత్రీకరణ జర్పలాని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ కే.జీ.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా ఉండబోతుందని.. ఆ సినిమా 2021 లో రిలీజ్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ పూర్తిగా రూమర్స్ అని తెలుస్తుంది. 2021 మొత్తం ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలే చేయబోతున్నాడు ప్రభాస్.