విజయవాడలోని కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. ప్రధాని మోదీ కూడా ఈ ఘటనపై స్పందించారు.
doubts rising over vijayawada fire accident
కేంద్రం నుంచి కూడా బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సీఎం జగన్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. స్టార్ హోటల్లో ప్రైవేటు హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఈ కోవిడ్ సెంటర్లో ఇంత దారుణం జరగడంపై పలు అనామానాలు రేకెత్తిస్తోంది. వీరిద్దరిలో నిర్లక్ష్యం ఎవరిదైనా.. కనీస జాగ్రత్తలు పాటించకుండా రోగులను అక్కడ ఎలా ఉంచుతారనే ప్రశ్న ఉదయిస్తోంది. వీటిపై అనుమానాలు విశ్లేషిస్తే..
అనుమానాలు.. ప్రశ్నలు ఇవే.. సమాధానం చెప్పేది ఎవరు?
- స్టార్ హోటల్లో ఫైర్ సేఫ్టీ మెజర్సు ఎందుకు లేవు. తాత్కాలిక ఆస్పత్రిగా మార్చినప్పడు రోగుల కోసం కనీస జాగ్రత్తలు పాటించలేదా?
- అన్నీ పరిశీలీంచే అనుమతులు ఇచ్చారా? లేకుండానే ఎలా అంగీకరించారు?
- రోగుల నుంచి భారీగానే వసూలు బందువులు అంటున్నారు. కరోనా రోగుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?
- మెరుగైన వైద్యం అందుతుందనే అపోహతో వెళ్లిన వారిలో ఆస్పత్రి, హోటల్ యజమాన్యం వ్యాపార కోణం మాత్రమే చూశారా?
- హోటల్ కు ఇన్సూరెన్సు ఉంటుంది. పేషెంట్ల దగ్గర కూడా ఎక్కువే వసూలు చేశారు. అయినా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50లక్షలు ఎందుకు ఇస్తోంది.
- పేదలకు రూ. 15వేలు మాత్రమే ఇవ్వటం దేనికి సంకేతం.
- ఘటనపై నిష్పక్షపాత ఎంక్వైరీ చేయించాలి.
- హోటల్ కు సరైన లైసెన్సులు లేవని.. ఏటా ఆయా శాఖలకు ముడుపులు ఇస్తున్నారనే ఆరోపణల్లో నిజం ఎంత?
- ఘటన జరిగిన తర్వాత అనుమతుల కోసం రమేశ్ హాస్పిటల్స్, హోటల్ యాజమాన్యం అన్ని శాఖలకు ముడుపులు ఇచ్చారనే వార్తలపై ప్రభుత్వం స్పందన ఏంటి?