కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. దాని కట్టడికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కూడా తెలిసిందే.. ఆ కట్టడిలో డాక్టర్లు, పోలీసులు వారి కుటుంబాలకు దూరంగా ఉండి నేటికీ సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆక్షలతో కూడిన వెసులుబాటే కానీ కరోనా పూర్తిగా పోలేదని ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుంటున్నాయి. దానికోసం పక్కా ప్రణాళికలు రూపొందిస్తునే ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ బాధ్యతే కాదు.. ప్రజల బాధ్యత కూడా ఉందని ఎంత మంది చేప్పినా కొందరికీ చెవికి ఎక్కడం లేదు.
దీన్ని అదునుగా భావించిన కొందరు వ్యాపారులు ఎవరికి ఏమైతే ఏంది.. నేనే బాగుంటే చాలు అన్నట్లు వ్యవహరిస్తూనే ఉన్నారు. ఈ కరోనా కాలంలో ఎలా పబ్లిసిటీని పెంచుకోవాలని ఆలోచిస్తూ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. పక్కవారి ప్రాణాలు పోతే మాకేంటని.. మీము బాగున్నాం కదా.. అన్నట్లే ఆలోచిస్తున్నారు. వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఆఫర్ల పేరుతో జనాలను గుమ్మికుడేలా చేస్తునే ఉన్నారు. భౌతిక దూరం పాటించడం మాట అటు ఉంచితే.. కనీస చర్యలు తీసుకోకుండా జనాలను ఆగం చేస్తున్నారు. మొన్న రూ. 10కి బిర్యాని అని ఆఫర్ పెట్టి జనాలను ఏలా అయితే గుమ్మికూడెలా చేశారో.. అలాగే ఇంకో చోట డ్రెస్ రూ. 25కే అంటు జనాలను గుమ్మికూడేలా చేశారు.
వివరాల్లోకి పోతే.. తమిళనాడులోని సేలంలో కొత్తగా ప్రారంభమైన ఒక బట్టల దుకాణం భారీ ఆఫర్లను ప్రకటించింది. 20 నుంచి 25 రూపాయలకే డ్రెస్లు అంటూ ప్రచారం చేసింది. దాంతో జనాలు పెద్ద ఎత్తున ఆ షాప్ కు వచ్చారు. అక్కడ ఎలాంటి కరోనా జాగ్రత్తలు తీసుకోకుండానే వందలాది మందితో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ బట్టల షాప్ ను సీజ్ చేశారు. జనాలకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని, ప్రాణాలకంటే బట్టలే ముఖ్యమా ? అంటూ పలువురు నెటిజన్లు ఈ విషయంపై కమెంట్స్ చేస్తున్నారు.