paper cup: మనం బయట ఎక్కడ టీ తాగిన పేపర్ కప్ లోనే ఇస్తారు. అయితే ఈ పేపర్ కప్పులో టీ తాగితే క్యాన్సర్ కచ్చితం గా వచ్చి తీరుతుంది అని వైద్యులు తెలియచేస్తున్నారు. అధ్యయనాలు సైతం పేపర్ కప్పుల్లో టీ తాగితే అనారోగ్యం తప్పదు అంటూ హెచ్చరిస్తున్నాయి. ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగితే ప్రమాదకరమని తెలిసిందే. అయితే వాటికి బదులుగా ఒకసారి వాడిపారేసే డిస్పోజబుల్ పేపర్ కప్పుల్ని ఎక్కువగా వాడుతున్నారు .
అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే ఈ పేపర్ కప్పుల్లో టీ తాగినా కూడా హానికరమేనని ఖరగ్పుర్ ఐఐటీ అధ్యయనంలో బయట పడింది.పేపర్ కప్పుల్లో వేడి ద్రవం పోసినప్పుడు ఆ పేపర్లో ఉండే మైక్రోప్లాస్టిక్ కణాలు, ఇతర ప్రమాదకర రేణువులు ఆ ద్రవంలో కలిసిపోతున్నాయి అని అధ్యయనం బయటపెట్టింది. సాధారణంగా పేపర్ కప్పులు హైడ్రోఫోబిక్ ఫిల్మ్ యొక్క సన్నటి పొరతో తయారు చేస్తారు. కాగా ఇందులోనూ పాలీ ఇథలీన్ అనే ప్లాస్టిక్ ఉంటుంది. వేడి ద్రవం పోసిన 15 నిమిషాల్లోపే ఈ మైక్రోప్లాస్టిక్ లేయర్లో చర్య జరిగి పోతుంది అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ తెలియచేస్తున్నారు.
85-90 డిగ్రీల సెల్సియస్ వేడి ఉండే 100 ఎంఎల్ వేడి ద్రవంలోకి పేపర్ కప్పు నుంచి 25 వేల మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదల జరుగుతుంది అని అధ్యయనంలో బయటపడింది. ఈ రేణువుల్లో అయాన్ తో పాటు క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత భారీ లోహాలు ఉంది వీటి వల్ల అనేక రకాల క్యాన్సర్లు వస్తాయని తెలియచేస్తున్నారు.
మృదువైన, తేలికైన ప్లాస్టిక్ లో డెన్సిటీ పాలిథిలిన్ ఉండటం వల్ల సాధారణ పరిస్థితుల్లో పేపర్ కప్పుల రీసైక్లింగ్ చాలా కష్టం గా మారింది. వీటిని రీసైక్లింగ్ చేయడానికి ప్రత్యేక పద్ధతులను అవలంబించవలిసి వస్తుంది.అందుకే పేపర్ కప్పులకు బదులు గాజు, స్టీల్ లేదా పింగాణీ గ్లాసుల్లో టీ తాగడం మంచిదని తెలియచేస్తున్నారు. ప్లాస్టిక్, పేపర్ కప్పులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని తెలియచేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?