టీ, కాఫీ మనిషికి పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఉపయోగపడే చక్కటి ఔషదం. పనిలో కూసింత సమయం దొరికితే చాలు కొలిగ్స్ తో కలిసి టీ టైంమ్ అంటూ ఒక చక్కటి టీ సేవిస్తుంటారు చాలా మంది. ఇండియాలో టీ కున్న ఫేమస్ మరేదానికి లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కదా ఇండియాలో టీ లేదా కాఫీ షాపులు ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి. ఫుట్ పాత్, రైల్వే స్టేషన్, బస్ స్టాప్ ఇలా ప్రతి దానిముందట టీ, కాఫీలు ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి. కాగా టీ లేదా కాఫీ లు తాగేవారు చాలా మంది వారు తాగే టీ గ్లాస్ మూలంగా ఎంత ప్రమాదం పొంచి ఉందో మాత్రం గ్రహించలేకపోతున్నారు.
టీ, కాఫీ లను చాలా వరకు పేపర్ కప్పులలో వినియోగిస్తుంటారు. అయితే ఈ పేపర్ కప్పుల మూలంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పేపర్ కప్పులో టీ లేదా కాఫీలను తాగడం మూలంగా ప్లాస్టిక్ శరీరంలోకి చేరి అనేక అనారోగ్య సమస్యలను తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే తాగినవెంటనే ఆ ప్లాస్టిక్ శరీరంపై ప్రభావం చూపకపోయినా ఫ్యూచర్ లో మాత్రం పేపర్ కప్పులో తాగినవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఈ విషయాన్ని ఐఐటీ ఖరగ్ పూర్ కు చెందిన ప్రొఫెసర్లు పరిశోధన ద్వారా వెళ్లడించారు. కాగా వేడి వేడి టీ లేదా కాఫీ డిస్పోజబుల్ పేపర్ కప్పులలోని ప్లాస్టిక్ కణాలు మనిషి శరీరంలోకి చేరతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా 3 సార్లు ఈ పేపర్ కప్పులలో కాఫీ లేదా టీ తాగినట్టయితే 75 వేల అతి సూక్ష్మ మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళతాయని నిపుణులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
వేడి వేడి టీ లేదా కాఫీలను ఆ కప్పులలో పోయడం మూలంగా ప్లాస్టిక్ కరిగి శరీరంలోకి చేరుతుందని శాస్త్రవేత్తలు వెళ్లడించారు. కాగా ఈ ప్లాస్టిక్ శరీరంలోకి చేరి అనేక వ్యాధులను సృష్టించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ మూలంగా కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా పొంచి ఉందని తెలుపుతున్నారు. మరీ ఈ పేపర్ కప్పులలో టీ తాగే వారు ఇకనైనా జాగ్రత్తవహించి వాటికి దూరంగా ఉండటం మంచిది. లేకపోతే మీరు అనారోగ్యాన్ని చేతులారా కొని తెచ్చుకున్నవారవుతారు.