చిటపట చినుకులు పడుతూ ఉంటే ఒక కప్పు వేడి వేడి టీ ని గుటకేస్తుంటే అబ్బా అప్పుడు వచ్చే హాయి మదిని పులకరింపచేస్తుంటుంది కదూ.. అవును మరీ తేనీటి ప్రియులు వేడి వేడి టీ తో తమ రోజును అలా ప్రారంభించేస్తుంటారు మరి. కాలాలు ఏవైనా కానివ్వండి కప్పెడు తేనీటిని వారి గొంతులో పొయ్యనిదే ఏ పని ప్రారంభించని వారు అనేకులుంటారు. మరి మీరు కూడా ఆ జాబితాలోనే ఉన్నారు కదూ….
సాధారణ టీ తో చుక్కలతో మొదలైన ఈ టీలు వివిధ రకాల ఫ్లేవర్లలో తేనీటి ప్రియులకు విందును చేస్తున్నాయి టీ హోటల్లు.. అల్లం టీ, బాధం టీ, ఇరాన్ టీ అని రకరకాల చాయ్ లు అందుబాటులోకిచ్చి టీ ప్రియులను ఆహ్వానిస్తున్నాయి. సరదాగా స్నేహితులతో బయటకు అలా వెళ్లినప్పుడూ కూసింత టీ చుక్కలను గొంతులతో దిగుతుంటే అబ్బా అప్పుడు వచ్చే హాయిని మళ్లీ తేగలమా అని ఫీలవుతూ టీ తో కాసేపు సేదతీరుతారు.
పనిలో మునిగే ప్రతి మనిషి గంటగంటకయినా టీ తో కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటారు. అందుకే కదా మన ఇండియాలో టీ ఇంత ఫేమస్ అవుతూ ఉంది. బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లలో ఇలా ఎక్కడా చూసినా తేనీరు అగుపిస్తూ ఉంటుంది. ఒత్తిడిగా, అలసటగా ఉన్నప్పుడు టీ చేసే మేలు మరెవ్వరూ చేయలేరు.. కదూ అందుకేనేమో అందరూ టీ ఆస్వాదిస్తూ సేదతీరుతుంటారు. మరి మీరు కూడా ఈ వేడి వేడి టీ ని గుటకేసే జాబితాలో ఉన్నరా.. అయితే డేంజరేనండోయ్..
హా తేనీటితో హాని ఏంటని ఆలోచిస్తున్నారు కదూ.. దానికి బలమైన కారణం ఉందండోయ్.. ఏంటంటే పొగలుకక్కే తేనీటి చుక్కలను గొంతులకోకి పోసినట్టయితే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాధముందని తాజాగా ఓ పరిశోధనలో వెళ్లడించారు. కాగా 60 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న గరం గరం చాయ్ తాగేవారికి అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు. అయితే చల్లటి టీని తాగేవారికి ఈ అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. మరి మీరు వేడి వేడి టీ ని తాగేవారైతే వీటిని గమనంలో ఉంచుకుని తాగండి.