కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ వినాయక చవితి పండుగను ఇండ్లలోనే జరుపుకుంటున్నారు. ఎప్పటిలా ఈసారి నవరాత్రి ఉత్సవాలు బహిరంగ ప్రదేశాల్లో జరగడం లేదు. అయితే వినాయక చవితి సందర్భంగా పలువురు వినూత్న రీతిలో గణనాథులను తయారు చేసి ప్రతిష్టించి పూజలు చేశారు. ఆ వినాయక ప్రతిమలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.
గుజరాత్లోని సూరత్కు చెందిన డాక్టర్ అదితి మిట్టల్ 511 డ్రై ఫ్రూట్స్తో వినాయకున్ని తయారు చేశారు. దాన్ని అక్కడి అటల్ సంవేదన కోవిడ్ హాస్పిటల్లో ఆమె ప్రతిష్టించారు. 10 రోజుల తరువాత ఆ ప్రతిమను తీసి అందులో వాడిన డ్రై ఫ్రూట్స్ ను అక్కడి పేషెంట్లకు పంచుతారు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని ఆమె తెలిపారు. అలాగే లూధియానాలో ఓ బేకరీ స్టోర్ వారు బెల్జియం చాక్లెట్లతో గణేష్ విగ్రహాలను తయారు చేశారు. అవి కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలు కావడం విశేషం.
Gujarat: Dr Aditi Mittal, a resident of Surat made Ganpati idol with dry fruits for #GaneshChaturthi.
She says, "I made this idol with dry fruits that have shell & it will be kept at a COVID hospital. After puja the dry fruits will be distributed among patients at the hospital" pic.twitter.com/AupCOURiuj
— ANI (@ANI) August 21, 2020
https://www.instagram.com/p/CEE47bYDqKm/?utm_source=ig_embed&ig_mid=AB003410-0B93-4F0B-90AF-DF82A43394F7
కాగా బెల్జియం చాక్లెట్లతో తయారు చేసిన ఆ విగ్రహాలను పూజించాక వాటిని పాలలో నిమజ్జనం చేయవచ్చు. అనంతరం మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగవచ్చని ఆ బేకరీ స్టోర్ వారు తెలిపారు. సదరు విగ్రహాల తయారీకి 3 కిలోల వరకు బెల్జియం చాక్లెట్లను ఉపయోగించినందున సైజుని బట్టి అవి రూ.3వేల నుంచి రూ.7వేల ధరలకు లభిస్తున్నాయి. ఇవి కూడా ఎకో ఫ్రెండ్లీ అయినందున ప్రజలు వాటిని నిమజ్జనం చేసేందుకు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. వీటి వల్ల బయట తిరగడం ఉండదని, కరోనా బారిన పడకుండా ఉండవచ్చని తయారీదారులు అంటున్నారు. అయితే పైన తెలిపిన డ్రై ఫ్రూట్స్ గణపతితోపాటు ఈ బెల్జియం చాక్లెట్ గణేష్ విగ్రహాల ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి.