ప్రపంచంలోనే చీపెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రీడమ్ 251ను ఆఫర్ చేసిన రింగింగ్ బెల్స్ కంపెనీ ఫౌండర్ మోహిత్ గోయెల్ ను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు.
డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్న మోహిత్ రూ.200కోట్ల రూపాయల మేర సరుకు సరఫరా చేసిన వారిని మోసం చేసినట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు.
ఏపీ నుండి కూడా ఫిర్యాదులు!
పోలీసుల కథనం ప్రకారం.. గోయెల్ మరో ఐదుగురితో కలిసి దుబాయ్ లో డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ హబ్ నేతృత్వంలో వ్యాపారం చేస్తున్నాడు. నోయిడా సెక్టార్ 62లో ఈ కంపెనీ ఆఫీసు ఉంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి ఆ కంపెనీ డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేసేది.అలా సరుకు సరఫరా చేసిన వారి నుండి కంప్లైట్లు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి అతణ్ని అరెస్టు చేశారు.
ఇదీ ఆయన మోడస్ ఆపరాండీ!
గోయెల్ మరో ఐదుగురితో కలిసి డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా డ్రై ఫ్రూట్స్ను మార్కెట్ ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తుండేవాడు. అలా సరఫరా దారుల అభిమానం సంపాదించుకున్న గోయెల్ నెట్ బ్యాంకింగ్ ద్వారా 40శాతం పేమెంట్ ను అడ్వాన్స్ కింద ఇచ్చేవాడు. మిగతా పేమెంట్ చెక్కు రూపంలో ఇస్తానంటే అంతా నమ్మేశారు. తీరా ఆయన ఇచ్చిన చెక్కులను తీసుకెళ్లి బ్యాంకుల్లో వేశాక అవి బౌన్స్ అయ్యేసరికి తెలిసింది అసలు నిజం.తమ పేమెంట్ పూర్తిగా ఇవ్వకపోగా.. ఆ డ్రై ఫ్రూట్స్ ను ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటూ డబ్బు సంపాదిస్తున్నాడని తెలుసుకున్నారు. బాధితుల్లో ఒకరైన ఓం ప్రకాశ్ జాంగిడ్ అనే వ్యక్తి చేసిన కంప్లైంట్ మేరకు నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. గోయల్ బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన కొందరు వ్యాపారులు కూడా ఉన్నారని వారు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం.
కాగా పోలీసులు ఆడితో పాటు రెండు కార్లను 60కేజీల డ్రై ఫ్రూట్స్, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనపర్చుకున్నారు కంపెనీ నిర్వహిస్తున్న సుమిత్ యాదవ్, రాజీవ్ కుమార్, ప్రవీణ్ సింగ్ సిర్వాన్ లకు కూడా ఇందులో భాగముందని తెలిసి వారిని కూడా అరెస్టు చేశారు. కాగా గోయెల్ మీద ఫోర్జరీ కేసులు కూడా ఉన్నాయని నోయిడా పోలీసులు తెలిపారు.అంతేగాకుండా సరుకు ఇచ్చిన వారికి డబ్బు ఎగ్గొట్టేందుకు వారిని హనీ ట్రాప్ లో ఇరికించేవారని పోలీసులు చెప్పారు..ఆ తర్వాత హనీట్రాప్ వీడియోలను వ్యాపారులకు చూపి వారిని బ్లాక్మెయిల్ చేసే వారన్నారు.ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తామని నోయిడా పోలీసులు స్పష్టం చేశారు ఇదే గోయల్ గతంలో అతి చౌక ధరకు స్మార్ట్ఫోన్ను ఇస్తానని పెద్దఎత్తున ప్రచారం సాగించారు.అప్పట్లోనే ఆయనపై పలు ఫిర్యాదులు ,ఆరోపణలు వచ్చాయి.ఇప్పుడు ఆయన అసలు రంగు బయటపడింది.