Dubai: కరోనా మహమ్మరిని ఎలా అయినా నివారించాలని ప్రభుత్వాలు ఎన్నో కఠిన మయిన నిభందనలను అమలు చేస్తునాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలకు ఇది పెద్ధ సవాలుగా మారింది. కానీ ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలను అమలు చేస్తున్నా ప్రజలు మాత్రం లైట్ తీసుకుని పార్టీ లు చేసుకుంటున్నారు. అందుకే కొన్ని దేశాలలో కరోనా రూల్స్ ని అతిక్రమిస్తే కఠిన మయిన చర్యలు తీసుకుంటున్నారు. బహుశా అందుకేనేమో ఆయా దేశాల్లో కరోనా కేసుల చాలా తక్కువగా నమోదయ్యాయి. కరోనా రూల్స్ ను నిశితంగా ఫాలో అవుతున్న దేశాలలో దుబాయ్ ఒకటి.
సాదారణంగా చిన్న చిన్న తప్పులకు భారీగా ఫైన్లు వేసే దుబాయి లో కరోనా నేపథ్యంలో అతిక్రమించిన వారికి ఆ దేశ అధికారులు చుక్కలు చూపించారు. ప్రస్తుతం ఉన్న కరోనా కారణంగా దుబాయ్ లో ప్రైవేటు పార్టీలపై నిషేదం అమలులో ఉంది. లేదు కచ్చితంగా ఆ పార్టీ నిర్వహించాలి అంటే ఆ పార్టీ కి కేవలం పది మంది మాత్రమే హాజరయ్యేలా అయితే అనుమతి లభిస్తుంది.
ఇటీవల దుబాయ్ లో ఓ ఏడారి ప్రాంతంలో ఒక ప్రైవేటు పార్టీ జరగగా దీనికి పదుల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఇక ఈ పార్టీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు, దుబాయ్ టూరిజం శాఖ అధికారుల తో సహ అక్కడికి వెళ్లారు. అక్కడ దేశంలో విధించిన నిబంధనలకు విరుద్ధంగా పార్టీ జరగుతున్న తీరుపై అధికారులు, ఆ పార్టీ నిర్వాహకుడికి ఏకంగా రూ.10లక్షల జరిమానా విధించారు. అలాగే ఆ పార్టీకి హాజరైన ప్రతి సభ్యుడికి ఒక్కరికి 15వేల చొప్పున దిర్హామ్ ల ఫైన్ వేశారు. ఈ ఫైన్ ని మన రూపాయిల్లో లెక్కిస్తే అది మొత్తం రూ.2.97 లక్షలు. ఇటువంటి కఠిన నిబందనల వలనే దుబాయ్ లో కరోనా నియంత్రణ మరియు మరణాలు తక్కువగా నమోదయ్యాయి.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.