దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు వైసిపికి టార్గెట్ అయ్యారు. రఘునందన్రావు దిష్టిబొమ్మలు తగలబెట్టేంత వరకు పరిస్థితి వెళ్లింది.
‘నేను సైన్స్ టీచర్ని.. ప్రకృతిని నమ్ముతాం. వెనకటి ఒకాయన గిట్లే మాట్లాడి, గట్లే పోయిండు.. పావురాల గుట్టల. నువ్వు కూడా గంతే. యాక్షన్కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది.’’ అని వైఎస్సార్ మరణంపై రఘునందన్ రావు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్సార్ పరిస్థితే తెలంగాణ సీఎంకేసీఆర్ కూడా వస్తుందని అనేలా రఘునందన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు.ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తిరిగి ఇలాంటి వ్యాఖ్యలు రఘునందన్రావు చేస్తే నాలుక కోస్తానని హెచ్చరించారు.పంధా మార్చుకోకుంటే దుబ్బాకకు వచ్చి మరీ వైసిపి నాయకులు కార్యకర్తలు కొడతారని కూడా రఘునందన్రావును కు ఆయన వార్నింగ్ ఇచ్చారు.
ఇక వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్ దేవేందర్రెడ్డి మరీ సీరియస్ హెచ్చరికలు చేశారు.కొత్త బిచ్చగాడి మాదిరి మాట్లాడొద్దంటూ ఆయనకు సలహా ఇచ్చారు.’అయ్యా రఘునందనరావా.. తమరెంత.. తమరి బతుకెంత..? మీరు వైఎస్ఆర్ గారి మరణం గురించి మాట్లాడేంత వారా? మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొందిన తరహా మరణాన్ని పొందాలంటే పాలకుడిగా పెట్టి పుట్టాలి! తన తుదిశ్వాస ను కూడా ప్రజల కోసం పోతూనే విడిచిన చరిత్ర వారిది! అప్పుడు మీలాంటి బొకాడియాలు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు.
మీరేంటి, చిత్తు కాగితంతో సమానమైన మీ చరిత్ర ఏమిటో మాకు అనవసరం. మీరు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయం చేయాలనుకుంటే.. మీ ప్రత్యర్థి పార్టీలను విమర్శించుకోండి. ఒకటి గుర్తుంచుకోండి… ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కానీ, వైఎస్ కుటుంబం గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. వారి కాలిగోటికి సరిపోదు మీ జీవితం.
కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టుగా మీరు ఇష్టానుసారం మాట్లాడవద్దు, మరోసారి ఈ తరహాలో మాట్లాడితే.. అందుకు పర్యవసనాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని బహిరంగంగా చెబుతున్నాం. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు రఘునందనరావ్’అని దేవేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.నిజానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైసిపి పోటీలో లేనప్పటికీ రఘునందన్రావు ఎందుకని ఆ పార్టీని టార్గెట్చేసి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విమర్శించారో ఎవరికీ అర్థం కాకపోయినా నోరు పారేసుకున్న దుబ్బాక ఎమ్మెల్యేకు వైసిపి నుండి విపరీతంగా కౌంటర్లు పడుతున్నాయి.అయితే రఘునందన్రావు మాత్రం ఇప్పటివరకు వీటిపై స్పందించలేదు.