హోరాహోరీగా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్లో ఇప్పటి వరకూ నాలుగు రౌండ్ లు పూర్తి అయ్యయి. తొలి నాలుగు రౌండ్ లలోనూ బీజేపీ తన ఆధిక్యతను కొనసాగించింది. నాలుగు రౌండ్లు పూర్తి అయ్యే సరికి బీజెపీ అభ్యర్థి రఘునందనరావు టిఆర్ఎస్ అభ్యర్థి సుజాత పై 2684 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాల్గవ రౌండ్ లో 1425 ఓట్ల ఆధిక్యంలో బీజెపీ అభ్యర్థి ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి మూడవ స్థానంలో ఉన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది.