హోరాహోరీగా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ తన ఆధిక్యతను కొనసాగిస్తున్నది. మూడు రౌండ్లు పూర్తి అయ్యే సరికి బీజెపీ అభ్యర్థి రఘునందనరావు టిఆర్ఎస్ అభ్యర్థి సుజాత పై 1259 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ లో 341, రెండవ రౌండ్ లో 794, మూడవ రౌండ్ లో 124 ఓట్ల ఆధిక్యంలో బీజెపీ అభ్యర్థి ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి మూడవ స్థానంలో ఉన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది.