హోరాహోరీగా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఆరు రౌండ్ లు పూర్తి అయ్యాయి. అయిదు రౌండ్ ల వరకూ బీజెపి అభ్యర్థి రఘునందనరావు అధిక్యత కొనసాగిస్తూ రాగా ఆరవ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు 351 ఓట్లు సాధించారు.
దీనితో ఆరు రౌండ్లు పూర్తి అయ్యే సరికి బీజెపీ అభ్యర్థి రఘునందనరావు అధిక్యత 3550 ఓట్ల నుండి 2669 ఓట్లకు తగ్గింది. మొదటి రౌండ్ లో 341, రెండవ రౌండ్ లో 794, మూడవ రౌండ్ లో 124, నాల్గవ రౌండ్ లో 1425, అయిదవ రౌండ్ లో 336 ఓట్లు బిజెపి అధిక్యతలో ఉండగా, ఆరవ రౌండ్ లో 351 ఓట్ల టిఆర్ఎస్ అభ్యర్థి సుజాత లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి మూడవ స్థానంలో ఉన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది.