దుబ్బాక ఉప ఎన్నికలలో గెలుపు నువ్వానేనా అన్నట్టుగా చివరి వరకు టీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య దోబూచులాడి కమలం పార్టీకి వరించింది. అయితే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడానికి గల కారణాలు విశ్లేషిస్తే ఒక్కసారైనా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో కేసిఆర్ పర్యటించక పోవటమే అని తేలిందట. కనీసం ఒక భారీ బహిరంగ సభ పెట్టిన టిఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలలో గెలిచి ఉండేదని సొంత పార్టీ నాయకుల అభిప్రాయం.
దీంతో దుబ్బాక రిజల్ట్ ఎఫెక్ట్ ఏమో తెలియదు గానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కేసిఆర్ దాదాపు పది రోడ్ షోలలో పాల్గొన్న భోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి షెడ్యూల్ ని టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం విడుదల చేసే అవకాశం ఉంది. కచ్చితంగా గ్రేటర్ పరిధిలో విస్తృతంగా పర్యటించాలని కెసిఆర్ డిసైడ్ అయినట్లు, ఏ మాత్రం బీజేపీకి అవకాశం మరోసారి రాకుండా గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు.
మరోపక్క బిజెపి నేతలు తమకి జిహెచ్ఎంసి ఎన్నికలలో అసలైన ప్రత్యర్థి ఎంఐఎం అంటూ టిఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా గ్రేటర్ ఎన్నికలలో ఎలాగైనా అధిక స్థానాలు గెలిచి పట్టు నిలుపుకోవాలని టిఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం కేసిఆర్ పార్టీ నాయకులతో సమావేశం కానున్నారట. ఈ సమావేశమైన వెంటనే కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని సమాచారం.