హోరాహోరీగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల సమరంలో విజయం ఎవరిని వరించనున్నదో మరి కొద్ది గంటల్లో తేలిపోనున్నది. రంగంలో 23 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ అన్నట్లుగా సాగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం అయ్యింది.
రెండు హాళ్లలో ఏడేసి చొప్పున 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయిదు వివి ప్యాట్లలోని స్లిప్పులనూ లెక్కిస్తారు. ఇవిఎంలు మోరాయించిన పక్షంలో వివి ప్యాట్లలోని స్లిప్పులను పరిగణలోకి తీసుకుంటామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.
దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 3వ తేదీన జరిగిన పోలింగ్లో మొత్తం 1,64,192 ఓట్లు పోల్ అయ్యాయి.
తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. వీటిలో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత ముందంజలో ఉన్నారు. అనంతరం ఈవిఎంలను తెరిచి ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు. ఫలితాలపై కౌంటింగ్ కేంద్రం బయట టీఆర్ఎస్, బీజెపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొన్నది. జోరుగా పందాలు సాగాయి.
మొదటి రెండు రౌండ్ లలో బీజేపీ అధిక్యం
మొదటి రౌండ్, రెండవ రౌండ్ బీజెపీ అభ్యర్థి రఘునందనరావు టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత పై ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ లో 341, రెండవ రౌండ్ లో 784 ఓట్ల ఆధిక్యంలో బీజెపీ అభ్యర్థి ఉన్నారు.