Bison: ఈ మధ్య కాలంలో పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందడంతో ఎన్నో వేల సంఖ్యలో అడవులను నాశనం చేస్తున్నారు. ఈ విధంగా అడవులు తగ్గిపోవటం వల్ల ఎన్నో రకాల జంతువులు ఆవాసం కోల్పోతున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఉన్న మృగాలు జనారణ్యంలో సంచరిస్తూ అందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎన్నో సింహాలు, చిరుతలు జనారణ్యంలోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి అడవిదున్న రహదారి పైకి రావడంతో ప్రస్తుతం ఈ అడవిదున్నకు – Bison సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సాధారణంగా అడవులలో నివసించే కొన్ని జంతువులు జనారణ్యంలో సంచరిస్తుంటాయి. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా అడవి నుంచి అడవి దున్నలు బయటకు రావు.కానీ మంగళవారం ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు వద్ద ఓ అడవి దున్న రోడ్డుపైకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అడవిదున్నను చూసిన స్థానికులు ఇప్పటివరకు ఈ అరణ్యంలో ఇలాంటి అడవి దున్నల ఆనవాలు కనిపించలేదని తెలియజేస్తున్నారు.
ఈ అడవి దున్న మాత్రం ధర్మవరం అటవీ ప్రాంతం నుంచి చెరుకూరు సమీపంలో ఉన్న జాతీయ రహదారి మీదుగా ఛత్తీస్గఢ్ను ఆనుకుని ఉన్న గుట్టల వైపు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ఈ అడవిదున్న జాతీయ రహదారిపైకి రావడంతో కొన్ని నిమిషాల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ అడవిదున్న రోడ్డు దాటుతున్న సమయంలో వాహనదారులు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.