ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి 2020 కౌన్సిలింగ్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఇప్పటికే ఆన్ లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 హెల్ప్లైన్ సెంటర్ల ఏర్పాటు చేశారు. తొలిసారిగా గిరిజన విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఎంసెట్ కన్వీనర్ కోటాలో మొత్తం 50,844 సీట్లు మాత్రమే భర్తీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇంకా కన్వీనర్ కోటాలో 19,276 బీటెక్ సీట్లు, బీఫార్మసీ లో సీట్లు మిగిలిపోయాయి చివరి విడతలో కొత్తగా 2,357 మంది మాత్రమే ధ్రువపత్రాల పరిశీలన హాజరయ్యారు. ఇప్పటికే సీట్లు పొందిన వారు వెబ్ సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి నవంబర్ 17వ తేదీ లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని చెప్పారు అంతేకాకుండా ఒరిజినల్ తీసి టి సి పాస్ ఫోటోస్టాట్ పత్రాలతో ఆయా కళాశాలల్లో సమర్పించాలని ఎంసెట్ కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 181 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 14 ప్రభుత్వ, 167 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. మొదటి విడత కౌన్సిలింగ్లో 48 కళాశాలల్లో అన్ని సీట్లు భర్తీ అవగా చివరి విడత కు వచ్చేసరికి ఆ సంఖ్య 38 కి తగ్గిపోయింది.
ఇప్పటికే సీట్లు పొందిన వారందరూ కళాశాలలో చేరని అలాంటివారు సుమారు ఐదు వేల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. యాజమాన్య కోటా కింద 30 వేల సీట్లు ఉండగా అందులో 20వేల వరకు భర్తీ అయ్యే అవకాశం ఉందన్నారు.
బి ఫార్మసీ లో మొత్తం సీట్ల సంఖ్య 3959. ఇందులో ఇట్లు పొందినవారు 165 అంటే ఫోర్ పాయింట్ టు 4.2 శాతం మాత్రమే సీట్లు భర్తీ కాగా మిగిలినవి 3,794. మిగిలిన సీట్లను ఎంసెట్ అగ్రికల్చర్ లో ర్యాంకు సాధించిన వారికి కేటాయిస్తారు.