శాన్టియాగో, జనవరి 20: చిలీ దేశంలో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదు అయ్యింది.
చిలీలోని కోక్యూంబోకు 15.6కిలో మీటర్ల దూరంలో 56 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూమి కంపించడంతో స్థానికులు ఒక్క సారిగా భయాందోళనకు గురి అయ్యారు. ఇళ్లలో నుండి ప్రజలు బయటకు పరుగులు తీశారు.
ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. కొక్యూంబో తీరంలో నివసించే వారు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వం అదేశించింది. తరువాత ఆ ఆదేశాలు రద్దు చేసింది. సునామీ సృష్టించే తీవ్రమైన భూకంపం కాదని వారు తేల్చి చెప్పారు.