ఈ 2020 గుక్కతిప్పుకోకుండా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. తాజాగా గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 7 గంటల 40 నిమిషాలకు భూకంపం సంభవించింది.
కొద్దిసేపటి క్రితమే గుజరాత్ ను ఊపేసిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.5 గా నమోదయింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సెసిమాలజీ ప్రకారం ప్రస్తుతానికి అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం గాని, ఆస్తి నష్టం దాని జరగలేదని చెబుతున్నారు. అయితే ఈ భూకంపానికి ‘ఎపీ సెంటర్’ అనగా భూకంప కేంద్రం మాత్రం తెలియట్లేదు.
నిన్ను కూడా గుజరాత్ రాష్ట్రంలోని చుట్టు పక్క ఊర్లలో స్వల్ప భూకంపం చోటు చేసుకోగా రాక్ కోట్ల్ లో అంతకుమించిన కంపనాలు నేడు రావడం గమనార్హం. అయితే రిక్టర్ స్కేల్ పై నమోదైన ప్రకారం ఇదేమీ అంత ప్రాణాంతకం కాదు. అయితే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?