Breaking: దేశ రాజధాని ఢిల్లీలో మరో సారి భూప్రకంపనలు సంభవించాయి. రెండు రోజుల క్రితం నేపాల్ లో సంభవించిన భూకంప ప్రభావంతో ఢిల్లీ పరిసర ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది మరువక మునుపే శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.4 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూప్రకంపనలు రాగానే స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. వెంటనే ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. రుషికేశ్ లోనూ ప్రకంపనలు వచ్చాయి.
మూడు రోజుల క్రితం బుధవారం తెల్లవారుజామున నేపాల్ లో భుకంపం సంభవించింది. దీంతో భారత రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. నేపాల్ లో 24 గంటల వ్యవధిలో రెండు సార్లు భూకంపాలు నమోదు అయ్యాయి. ఆనాడు సంభవించిన భూకంపం వల్ల పలు ఇళ్లు కూలిపోవడంతో నేపాల్ లో ఆరుగురు మృతి చెందారు. నాడు రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.6 గా నమోదు అయ్యింది. నేపాల్ లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. 2015 లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం పెను విద్వంసం సృష్టించింది. ఈ భూకంపం కారణంగా దాదాపు సుమారు 9వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 22వేల మంది క్షతగాత్రులైయ్యారు.
Earthquake of Magnitude:5.4, Occurred on 12-11-2022, 19:57:06 IST, Lat: 29.28 & Long: 81.20, Depth: 10 Km ,Location: Nepal, for more information Download the BhooKamp App https://t.co/4wntmaWERI @ndmaindia @Indiametdept @Ravi_MoES @OfficeOfDrJS @Dr_Mishra1966 @PMOIndia pic.twitter.com/eyQE1HMb5Z
— National Center for Seismology (@NCS_Earthquake) November 12, 2022