అవగాహన లేదు.. అనుభవం లేదు.. మాలాంటి మేధావులను సంప్రదించాలన్న ఆలోచనల లేదు.. అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నిత్యం విమర్శలు చేస్తూ ఉంటారు కానీ… కరోనా విషయంలో జగన్ ఆలోచనలు కరక్టే అని రోజుకో రకంగా తెలుస్తుంది! కరోనాను అంత సీరియస్ గా తీసుకోవద్దు.. అలా అని నిర్లక్ష్యం అస్సలు వహించొద్దు అని జగన్ చెప్పిన మాటే అనంతరం అంతా చెప్పారు అనే సంగతి అటుంచితే… కరోనా విషయంలో ఏపీలో జగన్ చేస్తున్న విస్తృత టెస్టుల పనే అంతా చేయాలని తాజాగా ఎయిమ్స్ సూచించింది!
కరోనా విషయంలో జగన్ ఏమి చేసినా, ఏమి చెప్పినా అది తప్పే అన్నట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడేవి! కరోనాతో సహజీవనం చేయాలని జగన్ ప్రకటించిన సమయంలో ప్రతిపక్షాలు మైకుల ముందుకు వచ్చి నానా రాద్ధాంతం చేశాయి. కానీ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లతో సహా మిగిలిన ముఖ్యమంత్రులు చెప్పే సరికి సైలంట్ అయిపోయాయి! ఇదే సమయంలో ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయనే కామెంట్లకు.. పెరుగుతున్న టెస్టుల సంఖ్యే దానికి కరణం అని ఏపీ సర్కార్ చెబుతూ వచ్చింది. ఇది సరైన చర్యే అని ఇప్పుడు ఎయిమ్స్ చెబుతుంది.
అవును… కోవిడ్-19 కేసులు ముమ్మర దశకు చేరిన మీదట “విస్తృతంగా టెస్టులు నిర్వహించాలి” అని ఎయిమ్స్ నేతృత్వంలో చేపట్టిన అథ్యయనం హెచ్చరించింది. కేసులు సంఖ్యలు ఎక్కువగా వెలుగు చూడటం అనే విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం, ప్రతిపక్షాలు ఏదో మాట్లాడతాయని వెనక్కి తగ్గడం వంటివి చేయడం ఏమాత్రం భావ్యం కాదని… అల్టిమేట్ గా ప్రజల ఆరోగ్యం ముఖ్యమని అంతా భావించాలని నిపుణుల హెచ్చరికలు రాకముందే ఆ పనికి ఏపీ సర్కార్ పూనుకుంది. ఈ సమయంలో తాజా అధ్యయనం ప్రకారం కూడా అదే తేలింది.
లాక్ డౌన్ను పూర్తిగా ఎత్తివేస్తే కరోనా వైరస్ కేసులు పెద్దసంఖ్యలో వెలుగుచూస్తాయని.. “విస్తృతంగా టెస్టులు నిర్వహించిన అనంతరమే లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయడంమేలని” ఎయిమ్స్ వైద్యుల నేతృత్వంలో సాగిన అథ్యయనం పేర్కొంది. లాక్ డౌన్ ప్రయోజనాన్ని పూర్తిగా పొందేందుకు భారత్ మరికొంత కాలం వేచిచూడాలని సూచించిన ఈ అధ్యయనం.. రోజువారీ కరోనా వైరస్ కేసుల్లో ఎలాంటి తగ్గుదల లేదని, ఇలాంటి పరిస్థితిలో లాక్ డౌన్ కు భారీగా సడలింపులు ఇవ్వడం వల్ల వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతాయని వెల్లడించింది.