ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విపరీతంగా విస్తరిస్తోంది. తెలంగాణ తో పోల్చుకుంటే రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదు కావడం నిజంగా ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలియజేస్తోంది. ఇక రోజు నమోదవుతున్న మరణాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఇలాంటి సమయంలో తమ జిల్లాలో అతి భారీగా కేసులు నమోదు అవుతుండడంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుండి రేపు ఉదయం వరకు కర్ఫ్యూ విధించారు. దీనికి సంబంధించి అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయిలో విధించగా ప్రజలకు ఎలాంటి షాపులు అందుబాటులో ఉండవు మరియు రోడ్డు పైన ఎవరు తిరగకూడదు. ఈ రకంగా ప్రజలను ఇంటివద్దనే ఉంచి వైరస్ వ్యాప్తి కానివ్వకుండా చూసి లక్షణాలు ఉన్న వారికి టెస్టులు జరిపి వారిని ఆస్పత్రికి కానీ హోమ్ ఐసోలేషన్ కు తరలించాలన్నది అధికారుల ఆలోచన.