ఒకేసారి ఎక్కువ పనులు లేదా బరువైన పనులు చేసేస్తే బాగా ఒళ్ళునొప్పులు వస్తాయి.లేదంటే ఏదైనా అనారోగ్గ్యం వచ్చినప్పుడు కూడా బాడీ పెయిన్స్ వస్తాయి.వీటిని తగ్గించుకోవడానికి పెయిన్ రిలీఫ్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. కానీ అలా వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వంటింటి పదార్ధాలు ఉపయోగించి కొన్నిచిట్కాలు పాటిస్తే చాలు ఒళ్లు నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం వస్తుంది.
ఒక్కొక్క సారి పొటాషియం లోపం వల్ల కూడా ఒళ్లునొప్పులుగా అనిపిస్తుంటుంది. ఈ లోపాన్ని అధిగమించాలంటే ప్రతిరోజూ 2, 3 అరటటిపండ్లు తింటే మంచిది.
దాల్చినచెక్క ఒక మసాలా దినుసు . రుచి కోసం దీనిని వివిధ వంటకాలలో వాడుతుంటారు. దాల్చిన చెక్కలో ఉండే ఔషధ గుణాలు శరీర నొప్పులకు చికిత్స చేయడానికి, ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఉపయోగపడతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకుని కొంచెం దాల్చిన చెక్కపొడి, తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు తాగడం వలన ఒళ్లునొప్పులు రాకుండా ఉంటాయి.
అల్లం రిచ్ ఫైటోకెమిస్ట్రీని కలిగి ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అల్లం శక్తివంతమైన యాంటీ ఇన్ల్ఫమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలతో ఉంటుంది. కొంచెం అల్లం తురుము ను ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించి చల్లారక ముందే దీన్ని తాగాలి. రోజుకి రెండు, మూడు సార్లు అల్లం టీ తాగితే బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి.
శరీర నొప్పులకు చికిత్స చేసేవాటిలో పసుపు కూడా ఒకటి.ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ, అనాల్జేసిక్, హీలింగ్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీర నొప్పులతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఒక గ్లాసు పాలలో తేనె పసుపు, వేసి బాగా కాలపాలి.ఆ పాలు కొంచెం చల్లారిన తర్వాత తాగితే రుచిగా ఉండడం తో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటిని రాత్రి పడుకునే ముందు తాగితే మంచిది. శరీరాన్నిఆవనూనెతో బాగా మర్దన చేసి 30 నిమిషాల పాటు అలానే ఉండనివ్వాలి. తర్వాత స్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే బాడీ పెయిన్స్ తగ్గుతాయి.