ఏపిలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు, ప్రభుత్వానికి వారధిగా వాలంటీర్లు పని చేస్తున్నారు. 50 నుండి వంద ఇళ్లకు ఒక వాలంటీర్ బాధ్యలు నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓటర్ల ఆధార్ అనుసంధానం, ఓటర్ల నమోదులో వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం ఏపి చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఇఓ) ముకేష్ కుమార్ మీనా దృష్టికి వెళ్లడంతో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల్లో వినియోగించరాదంటూ సీఇఓ ఎంకే మీనా అధికారులకు ఆదేశించారు.
గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఇఓ ఆదేశాలు జారీ చేశారు. ఓటరు కార్డు తో ఆధార్ అనుసంధాన ప్రక్రియలో వారిని భాగస్వాములను చేయవద్దని సూచించారు. వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధించిన ఏ పనులను అప్పగించవద్దని ఆదేశించారు. ఇప్పటికే ఎవరైనా అలాంటి పనులు అప్పగిస్తే పక్కన పెట్టాలని సూచించారు. ఓటర్ల నమోదులోనూ వాలంటీర్లను ఉపయోగించవచ్చని చెప్పారు. అదే విధంగా అభ్యర్ధులకు వాలంటీర్లు ఏజెంట్లుగా ఉండకూడదని తెలియజేశారు. ఈ విషయాల్లో స్పష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు సీఇఓ మీనా.
ఏపి రాష్ట్ర వ్యవస్థ బేషూగ్గా ఉన్నా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ సీఎం వైఎస్ జగన్ మండిపాటు