ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవితం ఆధారంగా ఎరోస్ నౌ ఛానల్ ప్రసారం చేస్తున్న వెబ్ సిరీస్ను వెంటనే నిలివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
‘ప్రధాని మోది జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘పిఎం నరేంద్ర మోది’ చిత్ర విడుదలను నిలిపివేస్తూ ఏప్రిల్ 10న ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలే మోది- జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ పేరుతో ఉన్న వెబ్ సిరీస్కు కూడా వర్తిస్తాయి. కానీ ఎరోస్ నౌ ఛానల్ ఈ సిరీస్ నుంచి ఇప్పటికే ఐదు ఎపిసోడ్లను ప్రసారం చేసింది. ఈ ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలి. అంతేగాక ఈ సిరీస్కు సంబంధించిన మొత్తం కంటెంట్ను మీ ప్లాట్ఫాం నుంచి తొలగించాలి’ అని ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
‘పిఎం నరేంద్ర మోది’ సహా రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఎలాంటి బయోపిక్లను ఎన్నికలు పూర్తయ్యేవరకూ విడుదల చేయొద్దని ఈ నెల 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ‘పిఎం నరేంద్ర మోది’ చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం చిత్రాన్ని వీక్షించి నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఇటీవల ఎన్నికల అధికారులు సినిమా చూశారు. దీనిపై తమ అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్ వెల్లడించాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?