అమరావతి: వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్టి చంద్రమోహనరెడ్డి ఫొని తుఫాను ప్రభావంపై సమీక్ష నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసి)అంగీకరించింది.
సచివాలయంలోని మంత్రి చాంబర్ లో శుక్రవారం సాయంత్రం తుఫాను ప్రభావంతో అకాల వర్షాలు, పంటల నష్టం తదితర విషయాలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
మంత్రి సమీక్షకు అధికారులు హజరయ్యేందుకు ఈసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
సమీక్షా సమావేశానికి వ్యవసాయ, ఉధ్యానవనశాఖ అధికారులు హజరుకానున్నారు.
ఇప్పటికే రెండు పర్యాయాలు సమీక్షా సమావేశాన్ని మంత్రి సోమిరెడ్డి ఏర్పాటు చేసినా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపధ్యంలో అధికారులు హజరు కాలేదు.
ఈ నేపధ్యంలో రాష్ట్రంలో పకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతుల ఇబ్బందులపై సమీక్ష జరిపేందుకు మంత్రి కార్యాలయం ఈసిని సంప్రదించింది. దీనిపై ఎన్నికల కమిషన్ నుండి అనుమతులు మంజూరు అయ్యాయి.