ఢిల్లీ: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా రైల్వే, విమాన టికెట్లపై ప్రధాని నరేంద్ర మోది ఫోటోలను ముద్రించడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. రైల్వే మంత్రిత్వశాఖ, పౌర విమానయాన శాఖల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై వివరణ కోరుతూ బుధవారం వేరువేరుగా లేఖలు రాసింది.
రైలు టికెట్లు, ఎయిర్ ఇండియా బోర్డింగ్ పాస్లపై ప్రధాని నరేంద్ర మోది చిత్రాలను ఎందుకు తొలగించలేదో తెలియజేస్తూ మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మంత్రిత్వశాఖలను ఎన్నికల సంఘం ఆదేశించింది.
రైలు టికెట్లపై ప్రధాని మోది ఫోటో ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ మంగళవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఆయా శాఖలకు లేఖలు పంపింది.