Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మరో ప్రముఖ వ్యక్తి అరెస్టు అయ్యారు. ప్రముఖ వ్యాపారి అమిత్ అరోరాను ఈడీ బుధవారం అరెస్టు చేసింది. బడ్డి రిటైల్ ప్రైవేటు సంస్థ యజమాని అయిన అమిత్ అరోరా .. ఢిల్లీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు ముఖ్య అనుచరుడని అధికారులు పేర్కొంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ, ఈడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో అమిత్ అరోరా 9వ నిందితుడుగా ఉన్నారు.
అమిత్ అరోరా అరెస్టుతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య ఆరుగురికి చేరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో దినేష్ అరోరా, అర్జున్ పాండే లతో కలిసి అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ విచారణలో తేలినట్లుగా చెబుతున్నారు. లిక్కర్ లైసెన్సులు జారీ చేసేందుకు అమిత్ అరోరా భారీగా డబ్బులు వసూలు చేశాడని వాటిని వేరే సంస్థలకు దారి మల్లించాడనే అభియోగాలు ఉన్నాయి.
ఈ కేసులో ఇప్పటికే మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ ఈ నెల 26న చార్జిషీటు దాఖలు చేసింది. నిందితులపై అనుబంధ చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మరి కొంత మందిని కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో దినేష్ అరారో సీబీఐ అప్రూవర్ గా మారారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం అధారంగా ఈడీ వేగంగా దర్యాప్తు కొనసాగిస్తొంది.
YS Jagan: ఈ విషయంలోనూ దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?