Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ నేత రాహుల్ గాందీ నేడు రెండువ రోజు ఈడీ ముందు హజరైయ్యారు. నిన్న సోమవారం దాదాపు పది గంటల పాటు రాహుల్ గాంధీని విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నేడు కూడా హజరుకావాలని ఆదేశించడంతో మరో సారి ఇడీ ముందుకు రాహుల్ గాంధీ వచ్చారు. సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా రాహుల్ గాంధీతో ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అంతకు ముందు ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణుల ధర్నాలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలపై కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు ఆంక్షలు విధించారు. అక్బర్ రోడ్, జన్ పథ్, ఈడీ కార్యాలయం తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కాగా ఇదే కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోనియా గాంధీ కరోనా బారిన పడిన నేపథ్యంలో జూన్ 23న హజరుకావాలని ఈడీ ఆదేశించింది. అయితే కరోనా తదనంతర సమస్యలతో మొన్న సోనియా గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు.