తెలుగు నాట జర్నలిజం అంటే మేమె.., మాకే సాధ్యం.., నీతి, నిజాయితీ అంటూ డబ్బాలు కొట్టుకునే రెండు పత్రికలూ జర్నలిజానికి ఊపిరి తీశాయి. జర్నలిజం మూల సూత్రాలను కూడా పాటించలేదు. ఒక ప్రభుత్వ ప్రతినిధి స్థాయిలో మీడియా సమావేశం నిర్వహిస్తే అక్షరం కూడా రాయలేదు. అఫ్ కోర్స్ వాళ్ళు “చంద్రబాబుకి భజన చేస్తే చేయొచ్చు గాక..! టీడీపీని భుజాన మొస్తే మొయొచ్చు గాక..! జగన్ కి వ్యతిరేకంగా పని చేయడమే వారి పత్రిక సూత్రాలు అవ్వొచ్చు గాక..! కోర్టులు, జస్టిస్ లు అంటే భయం ఉంటె ఉండొచ్చు గాక..! తమ అక్రమాలను ఆ జస్టిస్ ఎండగడతారు అని భయం ఉంటె ఉండొచ్చు గాక..!! కానీ ప్రభుత్వ ప్రతినిధిగా మీడియా ముందుకు వచ్చినప్పుడు కనీసం రెండు లైన్లు అయినా వార్త రాయాలి.
ఏం ఈనాడు..! ఇలా రాసుకోవచ్చుగా..!!
ఆంధ్రజ్యోతిని వదిలేద్దాం. చంద్రబాబు చంకన ఎక్కి కూర్చుంటుంది. ఆ పత్రికది జర్నలిజమే కాదు. ఈనాడు మేము టాప్, మేము తోప్ అంటుందిగా..! ఇప్పుడు ఏమైనట్టు..!? ఆ జర్నలిజం విలువలు, ఆ అక్షర నిబద్ధత ఎక్కడకు కొట్టుకుపోయినట్టు..? సరే..!! చంద్రబాబు అంటే మీకు భయం, భక్తి ఉంటె ఉండొచ్చు గాక..! కానీ వార్తని పూర్తిగా చంపెయ్యకుండా కాస్త రాసి ఉండాల్సింది. “ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కళ్ళం శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. రెండు రోజుల కిందట సీఎం జగన్ సుప్రీమ్ కోర్టు సీజేకి రాసిన లేఖని విడుదల చేసారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుల గురించి, అమరావతి విషయంలోనూ.., ఓ సుప్రీమ్ న్యాయమూర్తి గురించి వివరిస్తూ జగన్ ఈ లేఖలో ప్రస్తావించారని.., అజయ్ కళ్ళం మీడియాకు వివరించారు” అంటూ సింపుల్ గా వార్త రాయవచ్చుగా.
అలా రాసుకుంటే మీ పత్రిక పాఠకులకూ ఆ వార్త చదివినట్టు, సమాచారం ఇచ్చినట్టు ఉంటుంది.., మీ చంద్రబాబుకి సంతృప్తిగా ఉంటుంది, మీ అనుకూలులకు దెబ్బ తగలకుండా ఉంటుంది కదా..!? జర్నలిజాన్ని నడివీధికి ఈడ్చి.., సిబ్బందిని కులాల వారీగా చూసి.., అక్షరానికి చితి పేర్చి ఇంకా ఎన్నాళ్ళు పబ్బం గడుపుకుంటుందో ఈ తెలుగు మీడియా..!!