“రోజుకి 8 గంటలు పని. కానీ మేము ఈనాడు కోసం 24 గంటలూ ధారపోశాము. కానీ ఇప్పుడు మా కుటుంబాలను నడిరోడ్డుపై పడేసారు. కరోనా సమయంలో వదిలేశారు. మేమెక్కడ చావాలి..? ఇప్పటికే మాలో 80 శాతం గుజ్జు లాగేసారు. ఇంకా మిగిలిన 20 శాతం కూడా లాగేస్తారా..? ఇంత దౌర్భాగ్యమా..? ఈనాడు ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు..! పూర్వ జన్మలో చేసిన ఏదో పాపానికి నాడులో ఉద్యోగం చేయాల్సి వచ్చింది..!” ఇదీ ఈనాడులో బహిష్కరణ ఉద్యోగుల ఆవేదన..!! ఈనాడు నుండి తీసేసిన ఓ మాజీ చిరుద్యోగితో ఆ సంస్థలో ఉన్న హెచ్చార్ ఉద్యోగి ఫోన్ సంభాషణ ఇది. ఆ మాజీ ఉద్యోగి మాటలు వింటే గుండె తరుక్కుపోవడం ఖాయం..!!
“హలో..! సార్ ఎవరు ఫోన్ చేశారు..! (ఈనాడు బాధితుడు)
“నేను ఈనాడు ఆఫీస్ నుండి హెచ్ఆర్ ఇంఛార్జిని..! (ఈనాడు ఉద్యోగి)
“ఆ సార్ చెప్పండి సర్”
“మిమ్మల్ని మేనేజ్మెంట్ ఒకటి అడగమన్నాది”
“హా ఎవరు మేనేజ్మెంట్ అంటే ఎవరు..?? హెడ్ ఆఫీస్ వాళ్ళా..!? ఏమని అడగమన్నారు..?”
“చెప్పేది వినండి.. హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు అడగమన్నారు. మార్కెటింగ్ లోన, ప్రియా పచ్చళ్ళు లోన పని చేస్తారా..?” అని అడగమన్నారు..!
“నాలుగు నెలలు అయింది. తీసేసి. ఇప్పుడు గుర్తొచ్చిందా..? అందరూ మిమ్మల్ని తీసేసాం అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు గుర్తొచ్చాము..? ఇప్పటికే మాలో 80 శాతం గుజ్జు లాగేసారు. ఇంకా మిగిలిన 20 శాతం కూడా లాగేస్తారా..? “ఎంత మోసం సార్ ఈనాడు వాళ్ళుది. ఈనాడులో రేటా(యాడ్స్), సర్క్యులేషన్ వాళ్ళు రోజులో 24 గంటలూ చేసాము. సంస్థలో పెద్ద స్థాయిలో ఉన్నోళ్లకు రూ. లక్షలు, లక్షలు జీతాలు ఇస్తూ కూర్చోబెడుతున్నారు. మా లాంటి వాళ్లకి కనీసం ఒక 10 నెలలు ముందు చెప్పి, తీసేస్తాం అంటే ఆలోచించే వాళ్ళం. కానీ లెండి.. మేము పూర్వ జన్మలో చేసిన పాపానికి ఈనాడులో ఇన్ని ఏళ్ళు చేసాం. కొద్దీ రోజులు చేసి, అవకాశాలు చూసుకుని వెళ్లిపోవాల్సింది. మేము ఈనాడుకు పూర్తిగా చేసి, పెళ్ళాం.., పిల్లలను రోడ్డున పడేసుకునే స్థితికి వచ్చాము..! దీపోత్సవం అని పేరు పెట్టి రూ. 12 లక్షలు అన్యాయంగా తీసుకున్నారు. అందుకే 12 రూపాయలు అయినా మాకు ఇచ్చారా..? సంస్థపై నమ్మకంతో చేసాం. అదే పని యాడ్ ఏజెన్సీ వాళ్ళు చేస్తే వాళ్లకి రూ. 2 లక్షలు ఇచ్చేవాళ్ళు. కానీ మాకు మోసం చేసారు. ఇంత దౌర్భాగ్యమా..? ఇంత మోసమా..??
కదిలిస్తే కన్నీళ్లే..!!
కరోనా చాలా మంది జీవితాలను నాశనం చేసింది. కరోనా పేరు చెప్పి చాలా సంస్థలు ఉద్యోగుల జీవితాలను నాశనం చేశాయి. “ఈనాడు” సంస్థ రెండో కోవకు వస్తుంది. కరోనా కాలంలో దాదాపు 1200 మంది చిన్న స్థాయి ఉద్యోగులను పక్కన పెట్టేసింది. వాళ్ళు కూడా యాడ్స్, సర్క్యులేషన్ లో కీలకంగా పని చేసే వాళ్ళే..!! కరోనా కాలం, ఆదాయం లేదు అని సాకు చూపి… రూ. 10 , 12 వేలు జీతం తెచ్చుకునే చిన్న జీవులపై పడ్డారు. సంస్థలో ఉన్నత స్థాయిలో రూ. లక్షకు పైగా జీతం ఉన్నవాళ్లను మాత్రం వదిలేసారు. అలా అలా.. ఈనాడుకు క్షేత్రస్థాయిలో ఎల్లా తరబడి కీలకంగా పని చేసిన ఉద్యోగులను ఉన్నపళంగా పీకిపడేశారు. ఆ కుటుంబాలకు ఇప్పుడు కదిలిస్తే కన్నీళ్లు వెంటాడుతున్నాయి. కరోనా కలం, బయట ఉద్యోగాలు దొరకడం లేదు… నడి వయసులో ఉద్యోగాల వేటలో అలసి, విసిగి ఆ కుటుంబాలు ఇప్పుడు కన్నీటిని దిగమింగుతున్నాయి. ఇవీ మీడియా సంస్థలు వల్లించే నీతి కథలకు దర్పణాలు..!!