Eesha rebba : సాధారణంగా తెలుగమ్మాయిలు తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ కావడమే చాలా కష్టం. అలాంటి ఈషా రెబ్బ మాత్రం బాగానే తన సత్తా చాటుతోంది. పక్కా తెలుగమ్మాయి..తెలంగాణ అమ్మాయి..ఇలా టాలీవుడ్లో హీరోయిన్ గా క్రేజ్ సాధించిందంటే చాలా గొప్ప విషయం. ముంబై నుంచి వచ్చి ఇక్కడ వెలుగుతున్న మోడల్స్ అలాగే స్టార్ హీరోయిన్స్ ని తట్టుకొని పోటీ ఇస్తూ నిలదొక్కుకోవడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. కానీ ఈ విషయంలో ఈషా రెబ్బ మంచి పోటీ ఇచ్చింది. అంతక ముందు ఆ తర్వాత అనే సినిమాతో డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ టాలీవుడ్ కి తీసుకు వచ్చాడు.
మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే అమీ తుమీ చేసింది. బందిపోటు వంటి సినిమాలు ఈషా అకౌంట్ లో హిట్ సినిమాలుగా ఉన్నాయి. అయితే ఆ తర్వాత హీరోయిన్ గా కాస్త స్పీడ్ తగ్గింది. కానీ జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన అరవింద సమేత అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఈషాకి హీరోయిన్ గా అంతగా క్రేజ్ తీసుకు రాలేకపోయింది. కానీ డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద మాత్రం ఈమె సత్తా బాగానే చాటుతోంది. పిట్ట కథలు ఈషాకి బాగానే పాపులారిటీ తీసుకు వచ్చి పెట్టింది.
Eesha rebba : అరవింద స్వామీ లాంటి వాళ్లతో కలిసి ఈషా స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.
దీని తర్వాత అటు డిజిటల్ మీద గట్టిగా ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో పరభాషా చిత్రాల్లో నటించే అవకాశాలు అందుకుంటోంది. ఈ క్రమంలో మలయాళంలో ఒట్టు అనే సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది ఈషారెబ్బా. ఇది ఆమెకి ఊహించని అవకాశం. ఇతర భాషలో నటించే అవకాశం రావడం ఒకరకంగా గొప్ప విషయం. భారీ కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమాలో నటిస్తున్నారు. సీనియర్ స్టార్ నటుడు అరవింద స్వామీ లాంటి వాళ్లతో కలిసి ఈషా స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. అంతేకాదు ఈషాకి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్ ఉందట.