AC: ఆమ్మో ఎండలు చంపేస్తున్నాయి… అప్పుడే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా పెరిగిపోయాయి… వీటి నుండి తప్పించుకో వాలని చల్ల,చల్లగా ఏసీ లు వేసుకొని సెటిల్ అయిపోతున్నారా? అయితే మీకు సమస్య లు తప్పవనే చెప్పాలి. ఎందుకంటే.. ఎండ వేడి కన్నా ఏసీ చాల ప్రమాదమట. ఏసీ లో ఎక్కువ సేపు గడపటం వల్ల రక రకాల ఆరోగ్య సమస్యలు తప్పవట. వాటి గురించి తెలుసుకుందాం..ఏ సీ లో ఎక్కువ సేపు గడిపేవారి చర్మం పొడిబారిపోతుంది.
అంతే కాదు.. చాలాసేపు ఏసీ లో గడిపి ఒక్కసారిగా ఎండ లోకి వెళ్లారంటే ఆ సమస్య ఇంకా పెరుగుతుంది. పొడి చర్మం ఉండేవాళ్లకైతే ఈ సమస్య ఇంకాస్త ఎక్కువగా పెరుగుతుంది.
కళ్లు పొడిబారిపోయి నట్లు ఉండే వాళ్లు కూడా ఏసీ లో ఎక్కువ సేపు ఉండ కూడదు. ఏ సీ లో ఎక్కువ సేపు ఉండ టం వల్ల కంట్లో ద్రవా లు తగ్గిపోయి.. కళ్లు పొడిబారిపోతాయి. కాబట్టి కళ్లు పొడి బారే సమస్య ఉన్నవాళ్లు అసలు ఏసీ ఉండకుండా చూసుకోవడం ఉత్తమం.
వీటితో పాటు ఏసీ గదు ల్లో తేమ శాతం తక్కువగాఉండడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య ఎదురుకోవలిసి ఉంటుంది. విపరీతం గా దాహం వేస్తుంది కూడా .
ఏసీ గదు ల్లో ఎక్కువ సమయంఉండడం వల్ల ముక్కు, గొంతు, కళ్లు, శ్వాస కోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు చాల ఎక్కువ. వీటితో పాటు ముక్కు రంద్రాలు మూసుకుపోవడం, దాని వల్ల ముక్కు లోపల ఉండే సున్నితమైన పొర వాయడంవంటివి జరుగుతాయి.
దాని వల్ల ఇన్ఫెక్షన్ అయి ముక్కు వాసి లేని పోని సమస్య ల కు కారణమవుతుంది. కొందరికి అసలు మామూలుగానే ఏసీ లో ఉంటే పడదు. అయినప్పటి కీ, ఎండ వేడి ని తట్టుకో లేక ఏసీ గదు ల్లో గడిపితే మాత్రం తలనొప్పితప్పదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది మైగ్రేన్ కు కూడా దారి తీస్తుంది అని హెచ్చరిస్తున్నారు.