యునైటెడ్ స్టేట్స్ లో మద్యపాన సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న మహిళల రేటు పెరుగుతున్న విషయం అమెరికా ప్రభుత్వం తెలిపింది. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) అక్టోబర్లో ఆ విషయంపై ఒక నివేదికను విడుదల చేసింది. యునైటెడ్ స్టేట్స్లో ప్రతి సంవత్సరం మహిళల కంటే ఎక్కువ మంది పురుషులు మద్యపాన సంబంధిత కారణాల వల్ల మరణిస్తున్నారని తేలింది. కానీ ఈ సంవత్సరం మరణాల పెరుగుదల రేటు మహిళలలో ఎక్కువగా ఉంది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఉద్దేశించిన నిబంధనలను ఎదుర్కోవటానికి చాలా మంది మహిళలు మద్యం ఉపయోగిస్తున్నారని ఈ అధ్యయనం తెలిపింది. చాలా మంది మహిళలు ఇంటిని, పిల్లలను చూసుకుంటారు. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్స్ల వలన పిల్లల బాధ్యత కూడా పేరెంట్స్ పైనే ఉంది. ఆన్లైన్ అభ్యాసాన్ని కూడా వారే చూసుకోవాలిసి వచ్చింది. కాబట్టి ఇంటి పనులు, పిల్లల బాధ్యత మహిళలకు మరింత ఒత్తిడిని కలిగిస్తున్నాయి.
మద్యం పురుషుల కంటే మహిళలను ఎక్కువ ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి. పురుషుల కంటే మహిళలకు మద్యపాన సంబంధిత సమస్యలు త్వరగా ప్రారంభమవుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్కహాల్ అబ్యూస్ అండ్ ఆల్కహాలిజం (NIAAA) తన వెబ్సైట్లో, మహిళలు సగటున పురుషుల కంటే తక్కువ బరువు కలిగి ఉంటారని వివరించారు. ఆల్కహాల్ మెదడును కూడా దెబ్బతీస్తుంది. మరియు ఇది పురుషుడి మెదడును ప్రభావితం చేసే దానికంటే ఎక్కువగా స్త్రీ మెదడును ప్రభావితం చేస్తుంది.
మద్యం వలన మహిళకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆల్కహాల్ అబ్యూస్ అండ్ ఆల్కహాలిజం నిపుణులు అంటున్నారు.
మద్యం వలన వచ్చే సమస్యలు యునైటెడ్ స్టేట్స్కు మాత్రమే పరిమితం కాలేదు. అధిక ఆదాయ దేశాలలో పరిస్థితి ఇలానే ఉంది. ఆయా దేశాలలో ప్రజలు ధనవంతులు కావడంతో, మద్యపాన వినియోగం స్థాయి పెరిగిందని WHO నివేదిక పేర్కొంది .