ఈ మధ్య కాలంలో చాలా మందికి పని ఒత్తిడి కారణం గా అందుబాటులో తినడానికి ఏమి దొరికిన వాటిని తినేసి కడుపు నింపేస్తుకుంటున్నారు.ఇలా తినే వాటిలో ఎక్కువగా జంక్ ఫుడ్ ఉంటోంది.ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ తిని ఒకే చోట కదలకుండా కూర్చుని పనిచేయడం వలన చాలామంది బరువు బాగా పెరిగి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.కొందరైతే ఎం పర్లేదు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు సంగతి కదా అనుకుంటూ కొట్టి పారేస్తున్నారు. ఇలా ప్రతి రోజు జంక్ ఫుడ్ తినడం వలన జీవితం లో ఎన్నో సమస్యల బారిన పడవలిసిన పరిస్థితి ఎదురవుతుంది.
ముఖ్యంగా స్త్రీల పైన ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది . ఇలా జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన స్త్రీ శరీరం ఉండాల్సిన ఆకృతి లో కాకుండా కాస్త లావు గా ఉంటుంది. స్త్రీలు ఎవరైతే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారో వారిలో ఎక్కువగా సంతానలేమి సమస్యలు వస్తాయని ఓక పరిశోధనలో బయట పడింది.
ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటున్న స్త్రీలు గర్భం దాల్చిన కూడా వారిలో సమయానికి జరగాల్సిన ప్రక్రియ కాస్త నిదానం గా ఉంటుందని తెలిపారు.
అంతే కాదు గర్భవతిగా ఉన్నప్పుడు మద్యపానం, ధూమపానం, లాంటివి చేస్తే వారి సమస్యలు ఎక్కువ అవుతాయని పరిశోధనలో బయట పడింది .ఇలా జంక్ ఫుడ్,తోపాటు దురలవాట్లు ఉండడం వలన కడుపులోని బిడ్డకు అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జంక్ ఫుడ్ తగ్గించి కూరగాయలు ,పండ్లు, వంటి ఆహారం ఎక్కువగా తీసుకుంటే తల్లికి బిడ్డకి కూడా మంచిదని సూచిస్తున్నారు. కాబట్టి గర్భిణీలు వీలైనంత పౌష్ఠిక ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.