Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ (BJP) నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ప్రమాణ స్వీకారం చేశారు. ముంబాయి రాజ్ భవన్ కార్యాలయంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో సంఖ్యా బలం (106) బీజేపీకే ఎక్కువగా ఉన్నందున శివసేన రెబల్ ఎమ్మెల్యేల నేత ఏక్ నాథ్ శిందే మద్దతుతో దేవేంద్ర ఫడ్నవీస్ మరో సారి సీఎం బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారు. అయితే ఏక్ నాథ్ శిందే వర్గానికి బీజేపీ మద్దతు ఇస్తొందనీ, శిందే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఫడ్నవీస్ చెప్పారు. ప్రభుత్వానికి తాము దూరంగా ఉంటామని సంచలన ప్రకటన చేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలో మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు ఒప్పించారు. బీజేపీ కేంద్ర పెద్దల సూచనలతో ఏక్ నాథ్ శిండే మంత్రివర్గంలో భాగస్వామ్యానికి ఫడ్నవీస్ అంగీకరించి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బల నిరూపణపై నిన్న రాత్రి సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన క్షణాల్లోనే ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు ఉద్దవ్ ఠాక్రే. రాత్రి గవర్నర్ ను కలిసి ఉద్దవ్ రాజీమానా పత్రాన్ని అందించారు.
ఈ మధ్యాహ్నం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ శిందేలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్ నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు.