అమరావతి: వివాదాస్పద దర్శకుడు తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రాష్ట్రంలో ఎప్పుడు విడుదల అవుతుందనే సందిగ్దత నెలకొన్నది. మే ఒకటవ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటికీ మంగళవారం ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులతో మళ్ళీ విడుదల వాయిదా పడింది.
రాజకీయ నాయకుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఎటువంటి చిత్రాన్ని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు విడదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 10న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది.
మే1న రాష్ట్రంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు అనుమతించాలంటూ ఏప్రిల్ 25న దర్శకుడు రాంగోపాల్వర్మ ఈసీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై ఎలాంటి తదుపరి ఉత్తర్వులు ఇవ్వలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంపై వర్మ ఎలా స్పందిస్తారు? అసలు సినిమా రిలీజ్ అవుతుందా..? కాదా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?