అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలు దిక్కరించి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రదర్శించిన కడపలోని రెండు సినిమా ధియేటర్ లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల చేయవద్దని ఆదేశాలు ఉన్నా నిబంధనలకు విరుద్దంగా కడపలోని రెండు ధియేటర్లలో ప్రదర్శిచారని చెప్పారు. సినిమా ప్రదర్శన అడ్డుకోలేకపోయిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్పై చర్యలకు సిఇసికి సిఫార్సు చేశామని ద్వివేది తెలిపారు.
ఆరవతేదీ నిర్వహించనున్న రీపోలింగ్ పై అధికారులతో ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.