ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా దేశంలో ఉంది. సామాజిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతిని శుభ్రం చేసుకోవడం, ముఖానికి మాస్క్ తగిలించుకోవడం వంటివి తప్పనిసరి. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా ముట్టుకున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇది ఇప్పటికిప్పుడు మాత్రమే కాక భవిష్యత్తులో కూడా జాగ్రత్తపడటం మంచిది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈవీఎంల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పును తీసుకొచ్చింది. ఇకపై చేతివేళ్ళతో ఈవీఎం బటన్స్ ను నొక్కడానికి లేదు. దానికి బదులుగా ఒక కర్ర చెక్కను నొక్కాలని నిర్ణయించింది. సమీప భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు ఈ మార్పు ఉంటుందని స్పష్టం చేసింది.