అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే లోక్సభ, శాసనసభ ఎన్నికల కోసం పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది.
శాసనసభ స్థానాలకు 50 మందిని సాధారణ పరిశీలకులుగా రాష్ట్రానికి పంపనుంది. అలాగే 25 లోక్సభ స్థానాలకు మరో 25 మందిని నియమించింది.
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ పోలీసు పరిశీలకులుగా 13 మంది ఐపీఎస్లను రాష్ట్రానికి పంపనుంది.
ఈ నెల 25వ తేదీ నుంచి వీరంతా రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితి, ప్రచార సరళిని పరిశీలిస్తారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి నివేదికలు అందజేస్తారు.