MLC Elections: ఆంధ్రప్రదేశ్లో మూడు ,తెలంగాణలో ఆరు శాసనమండలి స్థానాలు ఖాళీ అవుతున్నా కొత్తగా ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో ఆశావహులు నిస్పృహ చెందుతున్నారు.సాధారణంగా శాసనమండలి లో ఖాళీ అయ్యే స్థానాలకు ముందుగానే ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీ.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16 నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికావస్తున్న సమయంలో అవి ఖాళీకాక ముందే భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది కరోనా ఉధృతి కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం శాసనమండలి ఎన్నికల నిర్వహణను నిరవధికంగా వాయిదా వేసింది.ఎప్పుడు ఎన్నికలు జరిగేది కూడా చెప్పలేమని ,సాధారణ పరిస్థితులు నెలకొన్నాక పరిస్థితిని సమీక్షించి అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ తరఫున శాసన మండళ్లకు వెళ్లాలని ఆశిస్తున్న ఆయా పార్టీల నాయకులు దిగాలు పడ్డారు.
ఏపీలో పరిస్థితి ఏంటంటే!
శాసనమండలి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న టిడిపి సభ్యుడు షరీఫ్, బిజెపి సభ్యుడు, రాష్ట్ర పార్టీ చీఫ్ సోము వీర్రాజు,వైసిపి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి మే నెలాఖరుకు రిటైర్ కాబోతున్నారు(వికీపీడియా ప్రకారం చూస్తే ఆ ముగ్గురు మే ఇరవై అయిదు నే రిటైర్ అయ్యారు)వీరి స్థానాల్లో ముగ్గురిని ఎన్నుకోవాల్సి ఉండగా అన్నీ కూడా వైసీపీకే దక్కబోతున్నాయి.అదే సమయంలో ఈ మూడు స్థానాలకు వైసిపిలో కూడా చాలా పోటీ నెలకొని ఉంది.గతంలో జగన్మోహన్రెడ్డి చాలామందికి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ ఇచ్చారు.వారంతా ఇప్పుడు క్యూలో ఉండటంతో ఎవరికి అవకాశం వస్తుందన్నది వైసిపి లో హాట్ టాపిక్ గా మారింది.
Read More: Police Crime Scene: పోలీసుని చితక్కొట్టిన యువకులు..! చాలా దారుణం..!!
తెలంగాణలో చైర్మన్ డిప్యూటీ చైర్మన్ రిటైర్మెంట్
ఇక తెలంగాణ విషయానికొస్తే జూన్ మూడువ తేదీన ఆరు స్థానాలు శాసనమండలిలో ఖాళీ కానున్నాయి.మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, వైఎస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, సభ్యులు కడియం శ్రీహరి, ఫరీరుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు పదవీ కాలం పూర్తి అవుతుంది.ఈ ఆరుగురు స్థానంలో కూడా కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ అది ప్పుడల్లా జరిగే పనిగా లేదు.ఆరు స్థానాలు కూడా టీఆర్ఎస్ కే దక్కబోతున్నాయి
అక్కడ కూడా చాలా పోటీ ఉంది.ఈ నేపధ్యంలో కరోనా ఎప్పుడు తగ్గుతుందా తమకెప్పుడు పదవీయోగం పడుతుందా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.