Electric scooters: పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరందుకున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఎలక్ట్రిక్ స్కూటర్ లలో మంటలు చెలరేగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ద్విచక్ర వాహనాల బ్యాటరీలతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కెనడాకు చెందిన స్టార్టప్ సంస్థ మేకర్ మ్యాక్స్ బ్యాటరీ ప్రమాదాల నివారణకు కసరత్తు చేస్తోంది. బ్యాటరీ ప్రమాదాలను.. ఫలితంగా ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించేందుకు టెస్టింగ్ పరికరాలు, ఆల్గోరిథమ్ లు రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. ఎం 201 పరికరంతో బ్యాటరీ వాస్తవ ప్రమాణాలను, దాని ప్రస్తుత పనితీరు ను పరిశీలించి చూడవచ్చని, వ్యత్యాసాలు ఏమైనా ఉంటే సత్వరం గుర్తించవచ్చని తెలిపింది. తద్వారా అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని సంస్థ వ్యవస్థాపకుడు అక్షయ్ పేర్కొన్నారు.
భారత్ లో ద్విచక్ర వాహనాల్లో బ్యాటరీలను ఉంచే లోహపు బాక్సుల్లో తగినంత భద్రతా ఫీచర్లు ఉండటం లేదని తెలిపారు. బ్యాటరీ నుండి వెలువడే వాయువులు బయటకు వెళ్లే మార్గం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామని చెప్పారు అక్షయ్. బ్యాటరీలను నూరు శాతం సురక్షితంగా తయారు చేయాలన్నది అందరి ఆకాంక్ష అయినప్పటికీ కోటి లో ఏదో ఒక బ్యాటరీలో తప్పకుండా సమస్యలు తలెత్తుతాయని అక్షయ్ అన్నారు. ఒత్తిడిని విడుదల చేయగలిగే వాల్వ్ లు గల మూడు లేదా అంతకు మించి కంపార్ట్ మెంట్లలో బ్యాటరీ లను ఉంచవచ్చని ఆయన పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?