YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల విషయంలో.. అనర్హులైన వారిని తీసివేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. రేషన్ కార్డు ఉండి దాదాపు మూడు నెలల నుండి రేషన్ తీసుకొని వారిని గుర్తిస్తూ.. కారణం తెలుసుకొని అది సరైనది కాకపోతే ప్రభుత్వం సదరు రేషన్ కార్డు ని బ్లాక్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ తరహా లో ఏడు లక్షల బోగస్ రేషన్ కార్డులు ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఇటువంటి బోగస్ రేషన్ కార్డుల వల్ల రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలకు.. న్యాయం చేయలేని పరిస్థితి ఉండటంతో జగన్ ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డులను కత్తి వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
చాలామంది అర్హులై ఉండి కూడా రేషన్ కార్డులు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో అటువంటి పరిస్థితులు ఇంకా రాష్ట్రంలో ఉండటంతో రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డులు ఎత్తి వేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మూడు నెలల నుండి రేషన్ తీసుకొని వారి లిస్ట్ నీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలకు పౌరసరఫరాల శాఖ పంపటం జరిగింది. దీంతో గ్రామంలోనే ఉంటూ మూడు నెలల్లో కూడా రాష్ట్రం తీసుకొని వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి.. రేషన్ తీసుకోకపోవడం కి గల కారణాలు తెలుసుకొని… కారణం అదే రీతిలో ఆధారాలు తగిన విధంగా లేకపోతే రేషన్ కార్డు బ్లాక్ చేయడానికి అధికారులు సన్నద్ధమయ్యారు.
మరోపక్క ఇప్పటికే ఇంటింటికి రేషన్ అందేలా జగన్ ప్రభుత్వం ఎప్పటినుండో ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇదే తరుణంలో కొత్త రేషన్ కార్డు అప్లై చేసే వారికి మూడు రోజుల్లోనే… రేషన్ కార్డు మంజూరు అయ్యేలా.. సచివాలయ వ్యవస్థతో పాటు ప్రభుత్వ వ్యవస్థలలో మార్పులు తీసుకువచ్చారు. ఈ విధంగా కొత్త రేషన్ కార్డు అర్హులైన వారికి అందిస్తున్న ప్రభుత్వం.. బోగస్ రేషన్ కార్డులు ఎత్తివేయడానికి.. తాజాగా సిద్ధమైంది.