ఇప్పుడు అందరూ మాటలు ఎలక్ట్రిక్ వాహనాలు గురించే.. అది బైక్ అయినా, స్కూటర్ అయినా, కార్ అయినా, ట్రాక్టర్ అయినా, బస్ అయినా , ఆటో అయినా ఇలా ఏదైనా కొనుగోలు చేయాలనుకునే వారి మొదటి మాట ఎలక్ట్రిక్ వాహనాల గురించే.. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం Tesla.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన, టెస్లా అధినేత ఎలోన్ మాస్క్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు..! తాజాగా టెస్లా ఇండియాలో ఒక సబ్సిడరీ కంపెనీ కోసం రిజిస్టర్ చేసుకుంది..! ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికారికంగా బెంగళూరులో నమోదయింది..!
టెస్లా లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది. టెస్లా బెంగళూరులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే తెలిపింది. అయితే కంపెనీ ఒక తయారీ కర్మాగారం తో సహా ఇతర ప్రణాళికలకు స్థలం ఇచ్చిందని చెప్పారు. ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికారికంగా కంపెనీ కార్యాలయం బెంగళూరు క్లబ్ ముందు ఉన్న రిచ్మండ్ సర్కిల్ జంక్షన్ నందు ఏర్పాటు కానుంది. ఇందులో టెస్లా సేల్స్ తో పాటు అసెంబ్లింగ్, ఎలక్ట్రిక్ కార్ల తయారీ చేయనుంది.
tesla ప్రపంచవ్యాప్తంగా అత్యంత మక్కువ చూపించే బ్రాంచ్లో బ్రాండ్లలో ఇది ఒకటి. ఇండియాలో టెస్లా అనుబంధ సంస్థ ఏర్పడడం భారత దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు చాలా అవసరమని డేటా అనలిటిక్స్ సంస్థ ఐ హెచ్ ఎస్ మార్కెట్ డైరెక్టర్ పునీత్ గుప్త అన్నారు.
ఇప్పటికే బెంగళూరు ప్రధాన కార్యాలయం సంస్థ ఓలా 2400 కోట్ల వ్యయంతో తమిళనాడులో రెండు మిలియన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ప్లాంటు ను ఏర్పాటు చేసి ముందుకు దూసుకెళ్తుంది.
ఇది కూడా చదవండి :మెరిసిపోతున్న మెర్సిడెస్-బెంజ్ సరికొత్త మోడల్స్.. ఫీచర్స్ అదరహో..