టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎట్టకేలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు. 44 కోట్ల డాలర్లతో ట్విట్టర్ ను మస్క్ హస్తగతం చేసుకున్నారు. ట్విట్టర్ ను స్వాధీనం చేసుకున్న వెంటనే ఆయన కీలక నిర్ణయాలను తీసుకున్నారు. టాప్ ఎగ్జిక్యూటివ్ లపై వేటు వేశారు. సీఈఓ పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దే, జనరల్ సీన్ ఎడ్జెట్ సహా మరి కొందరిని ఎలాన్ మస్క్ వేటు వేసినట్లు వాషింగ్టన్ పోస్టు, సీఎన్ బీసీ పేర్కొన్నాయి. మరో పక్క ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మస్క్ తొలిసారి స్పందించారు. పక్షి విముక్తి పొందిందంటూ ట్వీట్ చేశారు.
ట్విట్టర్ కొనుగోలు అంశానికి సంబంధించి కోర్టు అక్టోబర్ 28 వరకూ గడువు ఇచ్చిన నేపథ్యంలో మస్క్ ఆ ప్రక్రియను వేగవంతం చేశారు. 13 బిలియన్ డాలర్ల రుణాల కోసం ఇటీవల ఆయన బ్యాంకర్లతో సమావేశమైయ్యారు. తాజాగా ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపారు. ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ట్విట్టర్ లో తన ప్రొఫైల్ ను చీఫ్ ట్వీట్ గా మార్పు చేసుకోవడంతో పాటు తన లొకేషన్ ను సైతం ట్విట్టర్ ప్రధాన కార్యాలయంగా మార్పు చేశారు ఎలాన్ మస్క్.
వినూత్నంగా ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎలాన్ మస్క్