Elon Musk: ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని ఎలాన్ మస్క్ తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ను రూ.3 లక్షల (44 బిలియన్ డాలర్లు) కోట్లకు కొనుగోలుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ట్విట్టర్ ఖాతాల సంఖ్యలో ఎలాన్ మస్క్ సందేహాలకు ట్విట్టర్ యాజమాన్యం నుండి సమాధానం రాలేదు. ట్విట్టర్ లో ఉన్న ఖాతాలన్నీ అసలైనవేనా .. వాటిలో ఫేక్ ఖాతాలు ఎన్ని అనే అంశాలపై సందేహాలను ఎలాన్ మస్కా వ్యక్తం చేస్తున్నారు. తన సందేహాలకు సమాదానం ఇస్తేనే ఒప్పందం ముందుకు కదులుతుందని ఎలాన్ మస్క్ తేల్చి చెప్పారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాజాగా తమ వైఖరిని మరింత స్పష్టం చేశారు ఎలాన్ మస్క్. ఈ ఒప్పందం నుండి తాను తప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఫేక్ అకౌంట్లకు సంబందించి డేటాను ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైందని తెలిపారు. కొనుగోలు ఒప్పందాన్ని అనుసరించి ట్విట్టర్ తాను నిర్వర్తిస్తున్న బాధ్యతలను నిరాకరిస్తొందన్న విషయం తెలుస్తూనే ఉందని మస్క్ లీగల్ టీమ్ లేఖలో పేర్కొంది. నకిలీ ఖాతాల వివరాలు కావాలని మే 9 నుండి మస్క్ తరచూ కోరుతున్నారని గుర్తు చేశారు. విలీన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నందున ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు తమకు ఉందని మస్క్ లీగల్ టీమ్ లేఖలో స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ ఒప్పందాన్ని తాము తాత్కాలికంగా పక్కన బెడుతున్నామని వెల్లడించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?