తెలియని ఆందోళన, భయాలతో ఉన్న ప్రస్తుత తరుణంలో ఒకేరకమైన లక్షణాల తో బాధపడే రోగం వస్తుందనే ఆలోచన సామూహికంగా ఉధృత మవుతుంది. కోవిడ్ భయాందోళనలు ఒకవైపు ప్రజలను పట్టి పీడిస్తున్న సమయంలో విపరీత భయాందోళనలు కలిగించే విషయాలు విన్నా, చూసినా,వార్తల రూపంలో పరిశీలించినా, అవి సులభంగా వారి శరీర ధర్మాన్ని, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
**దీన్నే ఎపిడమిక్ హిస్టీరియా, సైకోజెనికి డిసార్డర్ అంటారు. ఈ లక్షణాలు తెలియకుండానే మనస్సు తనపై అప్లయి చేసుకుంటూ అందరిలోనూ ఒకే వ్యాధి లక్షణాలు కనిపించేటట్లు చేస్తూ ఉంటుంది.
** ఊపిరి అందకపోవడం ,గుండేవేగం,చెమటలు ,వాంతులు,నోటినుండి నురుగలు,ఫిట్స్ మాదిరి కొట్టుకోవడం జరుగుతుంది.
**సాధారణ జన జీవితం లో నీరసంగా ,కళ్ళుతిరగడం,వాంతులు,వికార లక్షణాలు చాలా తరచుగా చాలా మందిలో సహజంగానే ఉంటాయి .ఇలాంటి మాస్ హిస్టీరియా సమయం లో వీరాంత విపరీత ప్రవర్తన కు గురౌతారు .
**ఉదాహరణకు స్కూల్ లో విద్యార్థులు భోజనాలు అయ్యాక చివరి విద్యార్థి కనుక ఆహారంలో బల్లి పడిందని తెలుసుకుని కళ్ళు తిరగడం,వాంతులు ,పొట్టనెప్పికి గురైతే ఆ విషయం తెలుసుకున్న మిగిలిన అందరి విద్యార్థులకు మాస్ హిస్టీరియా వలన అవే లక్షణాలు అందరిలో కనిపిస్తాయి.
సైకాలజిస్ట్ చెబుతున్నది ఇది
** భయం కలిగించే పుకార్లు షికార్లు చేయించ రాదు
** వార్తలు ప్రసారం లో సంయమనం పాటించాలి.
** ఫస్ట్ ఎయిడ్ చేయించి ధైర్యం చెప్పాలి
** కోవిడ్ సమయంలో మానసిక సమస్యలు ,డిప్రెషన్ స్థాయిలు అధికంగా ఉండడం సహజం వీరందరికి గ్రూప్ కౌన్సెలింగ్,కమ్యూనిటీ కౌన్సెలింగ్ అందచేయాలి
?రూమర్స్ ,అపోహలు వ్యాప్తిని అరికట్టాలి
మనోధైర్యమే మందు.