కరోనా వైరస్ రాకతో అంతా మారిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దీనివల్ల ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది. దాని ఎఫెక్ట్ పేదోడి నుంచి కోటీశ్వరుడి వరకు పడింది. ఇలాంటి సమయంలో పభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిర్ణయాల్లో ఒక విషయం ఇప్పుడు క్రెడిట్ కార్డ్ వాడే వరిపై పడింది. దీంతో క్రెడిట్ కార్డ్ వాడేవరికి ఇది బ్యాడ్ న్యూస్ అని పలువురు చెబుతున్నారు.
కరోనా వల్ల ఎందరో ఉద్యోగాలు పోగుట్టుకున్నారు. ఎందరో తినడానికి తిండిలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ప్రజల ఆదాయం తగ్గిపోతున్న ఈ సమయంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి లోన్ మారటోరియం ప్రయోజనాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఇందులో పర్సనల్ లోన్ నుంచి క్రెడిట్ కార్డుల వరకు ఈ లోన్ మారటోరియం వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. దాంతో బ్యాంకులు వారి కస్టమర్లకు ఈ బెనిఫిట్లను అందించాయి. దీంతో ఒక సమస్య వచ్చింది. బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి వడ్డీ మీద వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. పలువురు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ విషయంపై ఇప్పుడు సుప్రీం కోర్టులో వాదలను నడుస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం వడ్డీ మీద వడ్డీ మాఫీకి రెడీగా ఉంది. కానీ దీన్ని ఆర్బీఐ అంగీకరించడం లేదు. దీంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని తెలుపుతుంది. అలాగే ముఖ్యంగ బ్యాంకింగ్ రంగంపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుపుతుంది. దీనిపై సుప్రీం కోర్టులో ఈ రోజు కూడా చర్చ జరిగింది. దీనిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. క్రెడిట్ కార్డు వాడే వారికి చక్ర వడ్డీ మాఫీ ప్రయోజనం అందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
సుప్రీం కోర్టు చేసిన ఈ కీలక వ్యాఖ్యల వల్ల క్రెడిట్ కార్డు వాడే యూజర్లకు ఇది బ్యాడ్ న్యూస్ అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.క్రెడిట్ కార్డు వాడే యూజర్లు రుణ గ్రహీతల కిందకు రారని సుప్రీం కోర్టు తెలిపింది.