Enforcement Directorate: ప్రముఖ మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ సంస్థ ఆమ్ వే ఇండియాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. సదరు సంస్థపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు..రూ.757 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసుకున్నారు. ఆమ్ వే ఇండియా సంస్థ నిబంధనలకు విరుద్దంగా చెయిన్ లింక్ మార్కెటింగ్ ద్వారా స్కామ్ కు పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కంపెనీ ఉత్పత్తులు బహిరంగ మార్కెట్ లో లభించే ప్రముఖ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని ఫిర్యాదులు అందాయి. ఈ పిర్యాదులపై దర్యాప్తు చేసిన ఈడీ అధికారులు సదరు కంపెనీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో సంస్థకు ఉన్న భూమి, ఫ్యాక్టరీ భవనంతో పాటు యంత్రాలు, మిషనరీ లను అదికారులు సీజ్ చేశారు. రూ.411.38 కోట్ల విలువైన స్థిర చరాస్తులతో పాటు 36 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.345.94 కోట్ల నగదును అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews